ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేయాలి

Jun 12 2025 7:27 AM | Updated on Jun 12 2025 7:27 AM

ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేయాలి

ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేయాలి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలుకాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడంరెడ్డిబాబు కోరారు. కడప ప్రకాశ్‌నగర్‌లో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ టెక్నోల పేరుతో కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యా వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం గాకముందే అడ్మిషన్లు చేయించుకుంటూ దోపిడీకి తెరతీస్తున్నారన్నారు. కనీస సదుపాయాలు లేకున్నాఇరుకుభవనాల్లో విద్యా సంస్థలను నడుపుతున్నారన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికల బాధలు వర్ణణాతీతం అన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌ చొరవ తీసుకుని విద్యా చట్టాన్ని అమలు చేసే విధంగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంక్షేమ చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓర్సు వీరభాస్కర్‌. ఎస్‌ఎండీ.యూసుఫ్‌బాషా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్‌.మణికుమార్‌ పాల్గొన్నారు.

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడంరెడ్డిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement