చెరువును చెరబట్టారు! | - | Sakshi
Sakshi News home page

చెరువును చెరబట్టారు!

Jun 12 2025 3:21 AM | Updated on Jun 12 2025 3:21 AM

చెరువ

చెరువును చెరబట్టారు!

బుగ్గవంకనూ వదల్లేదు..

కడప నగరం మధ్యలో ప్రవహిస్తున్న బుగ్గవంకను కూడా టీడీపీ నాయకులు తమ అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకున్నారు. బుగ్గవంక బ్యూటిఫికేషన్‌ పేరు చెప్పి రూ.3.50 కోట్ల అత్యధిక మొత్తానికి టెండర్లు పిలిచి బుగ్గవంకలోని కంపచెట్లను తొలగించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు వంకలోని మట్టిని కూడా అమ్ము కొని సొమ్ము చేసుకుంటున్నారు. పాలెంపల్లె వద్ద బుగ్గవంకలోని మట్టిని జేసీబీ, హిటాచీలతో తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. నెలరోజులు గా ఇలాగే తరలిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని రూ.500 చొప్పున విక్రయిస్తూ రోజుకు 600 ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నెలరోజుల్లో రూ.90లక్షల వరకూ ఆర్జించినట్లు తెలుస్తోంది. నిత్యం ట్రాక్టర్లు మట్టితో తిర గడం వల్ల పాలెంపల్లె, బుడ్డాయపల్లె గ్రామా ల్లోని రోడ్లు మట్టితో నిండిపోయాయి. వాహనాలు వెళ్లినప్పుడల్లా దుమ్ము,ఽ ధూళి పైకి లేచి ఇళ్ల నిండా దుమ్ము పేరుకుపోతోందని, ట్రాక్టర్ల శబ్దాలతో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడుతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

కడప కార్పొరేషన్‌: కడప నగరానికి అతి సమీపంలో ఉన్న పాతకడప చెరువును టీడీపీ నేతలు చెరబట్టారు. చెరువులోని మట్టిని జేసీబీలు, హిటాచీలతో తవ్వి 15 టిప్పర్లు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు మట్టి సారవంతంగా ఉంటుంది కనుక చౌడు భూముల్లో సారవంతమైన ఈ మట్టిని వేస్తే పంటలు బాగా పండేందుకు ఆస్కారముంటుంది. అలాగే లో లెవెల్‌ ఏరియాలలో ఎత్తు పెంచడానికి ఈ మట్టిని ఉపయోగిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ రూ.5వేలు, ఒక్కో ట్రాక్టర్‌ రూ.600 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక రోజుకు టిప్పర్లతో 100 ట్రిప్పులు, ట్రాక్టర్లతో 100 ట్రిప్పులు తోలినా రూ.5.50లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు తోలుకుంటే అన్ని లక్షల ఆదాయం అన్నమాట. పాత కడప రైతులమంటూ కొంతమంది విచ్చలవిడిగా దందా మట్టి రవాణా చేస్తూ చెరువును తవ్వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దర్జాగా మట్టి అక్రమ రవాణా చేస్తుంటే ఇరిగేషన్‌, మైన్స్‌ అండ్‌ జియాలజీ, పోలీసు అఽధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. మట్టి మాఫియాపై కొందరు అధికార పార్టీ నేతలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్‌ అయినా స్పందించి చర్యలు తీసుకుంటారని వారు ఆశిస్తున్నారు. నివాస గృహాలకు దగ్గరగా బఫర్‌ జోన్‌లో మట్టి తవ్వడం వల్ల చెరువుకు నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఈతకు వెళ్తే లోతు తెలియక ఇరుక్కుపోయి చనిపోయే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాలు ఇదివరకు చాలానే జరిగాయి కూడా. అయినా ఇరిగేషన్‌ అఽధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి తోలడం వల్ల దేవుని కడప, పాత కడప ప్రాంతాలు దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాత కడప చెరువులో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్న వైనం

రెండు జేసీబీలు, పది టిప్పర్లు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా అక్రమ రవాణా

చెరువును చెరబట్టారు! 1
1/1

చెరువును చెరబట్టారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement