పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..? | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?

Jun 11 2025 9:08 AM | Updated on Jun 11 2025 9:08 AM

పత్రి

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?

పులివెందుల టౌన్‌ : సాక్షి సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ అక్రమ అరెస్టు, సాక్షి కార్యాలయాలపై దాడులు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఆపాలంటూ పులివెందుల జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ర్యాలీ చేపట్టింది. మంగళవారం పట్టణంలోని పాత బస్టాండు నుంచి మెయిన్‌ బజార్‌, పూలంగళ్ల సర్కిల్‌, కచేరి రోడ్డు మీదుగా అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు మీడియా మిత్రులు ర్యాలీగా చేరుకుని ఏఎస్‌ఐ సిద్ధార్థ, హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జునరెడ్డిలకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాత్రికేయుల అక్రమ అరెస్టులపై, దాడులు, దౌర్జన్యాలు జరగకుండా చూడాలని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు కార్తీక్‌, రాజు, దామోదర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, ప్రవీణ్‌, కృష్ణకుమార్‌, చంద్రమోహన్‌రెడ్డి, రమణారెడ్డి, జయరామిరెడ్డి, విమన్‌, సుబ్బారెడ్డి, ప్రకాష్‌, రాము, రామ్మోహన్‌, శంకర్‌, ఓంప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ముద్దనూరు : సాక్షి దినపత్రిక కార్యాలయాలపై దాడి, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుకు నిరసనగా మండల పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో ఎస్‌ఐ మైనుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్‌(సాక్షి), ఏసు(ప్రజాశక్తి), బాలకృష్ణ(వార్త), సుధాకర్‌(విశాలాంధ్ర), శ్రీనివాసులు (ప్రజాభూమి)నందకుమార్‌(జ్యోతి), భాస్కర్‌బాబు(సాయంకాలం) పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్‌పై మండిపడిన పాత్రికేయులు

పోలీసులకు వినతి పత్రాలు

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?1
1/1

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement