
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం ఉదయం 9.30 గంటలకు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై.అహ్మర్ బాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వీరకళ్యాణ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీ్త్ర, పురుషులకు 100 మీటర్లు, 200 మీ., 400 మీ., 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, షాట్పుట్, డిస్కస్త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 14, 15వ తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. 18 ఏళ్లు నిండిన సీ్త్ర, పురుషులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని, మరిన్ని వివరాలకు 9949686586, 8019880995 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.
యువకుడి మృతి
వీరపునాయునిపల్లె : మండలంలోని వీరపునాయునిపల్లె ఎస్సీ కాలనీలో యువకుడు ప్రశాంత్(22) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు ప్రశాంత్ తల్లి మృతి చెందడంతో మద్యానికి బానిసైన ప్రశాంత్ జులాయిగా తిరుగుతూ తరచూ తండ్రితో గొడవపడేవాడు. గతంలోనూ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం ఉందని ఎస్సై మంజునాథ్ తెలిపారు. రెండు రోజుల కిందట మళ్లీ తండ్రీ, కొడుకుల మద్య ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురై సోమ వారం రాత్రి ఇంట్లోనే ప్రశాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
గోపవరం : మండలంలోని రాచాయపేట పంచాయతీ బెడుసుపల్లి దళిత వాడకు చెందిన అట్లూరు వెంకటయ్య(45) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నవరం నుంచి ద్విచక్ర వాహనంలో వెంకటయ్య బెడుసుపల్లెకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటయ్య మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఇంటి యజమాని మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు