
గొడ్డలితో దాడి
ముద్దనూరు : ఓ సంఘటనలో ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. దేనేపల్లెలో రామ్మోహన్ ఈ నెల 8న పెద్దమ్మ తల్లికి కొందరి సాయంతో యాటలు నిర్వహించాడు. అయితే గూనిగాండ్ల శివను దీనికి పిలవలేదు. దీంతో రామ్మోహన్ నీ కథ చూస్తా అంటూ గూనివాండ్లశివ బెదిరించాడు. అంతిటతోఆగ కుండా రామ్మోహన్ మంగళవారం తోటలో పనిచేయిస్తుండగా.. లక్షుమయ్య, శివశంకర్, నరసింహ, ఉత్తయ్యలతో వచ్చి.. శివ తన గొడ్డలితో రామ్మోహన్పై దాడిచేశాడు. గాయాలైన రామ్మోహన్ ఫిర్యాదు మేరకు గూనివాండ్లశివ, మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసభ్య ప్రవర్తనపై కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని దేనేపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి రామ్మోహన్ తోటలో కూలి పనులకు వెళ్లింది. పైపులు తేవాలంటూ తోట యజమాని రామ్మోహన్ ఆమెను పిలిచాడని, అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని, తప్పించుకోబోగా కులం పేరుతో దూషించాడని విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదో విధంగా తప్పించుకుని బయటపడినట్లు ఆరోపించింది. దీంతో రామ్మోహన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : మైదుకూరు రోడ్డులోని ధారా అపార్ట్మెంట్ వెనుకవైపున గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరేసుకొని ఉండటంతో ఆ ప్రాంత వాసులు మంగళవారం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి సుమారు 65–70 ఏళ్లు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
నలుగురు తహసీల్దార్ల బదిలీ
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులిచ్చారు. బ్రహ్మంగారిమఠంలో పనిచేస్తున్న డి.దామోదర్రెడ్డిని ఒంటిమిట్టకు, అక్కడ పనిచేస్తున్న ఏవీ.రమణమ్మను ఖాజీపేటకు బదిలీచేశారు. ఖాజీపేటలో ఉన్న డి.మహబూబ్బాషాను జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలోని కేఆర్ఆర్సీ విభాగానికి బదిలీ చేశారు. గోపవరం తహసీల్దార్ ఆర్.జీవన్ చంద్ర శేఖర్ను ముద్దనూరుకు బదిలీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నందున జీవన్ చంద్రశేఖర్ను జిల్లా కేంద్రంలోనే ఉంచాల్సి ఉంది. అయినా కడపలో కాకుండా ముద్దనూరుకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.