హామీలు అమలుచేయలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలుచేయలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌

Jun 11 2025 8:56 AM | Updated on Jun 11 2025 9:08 AM

జమ్మలమడుగు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎవరో చెప్పారంటూ.. ఒక అంశాన్ని పట్టుకుని వైఎస్సార్‌సీపీ, సాక్షికి ముడిపెట్టి టీడీపీ నాయకులు ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు పక్కనపెట్టి టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆందోళన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వచ్చిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక కెఎస్‌ఆర్‌ లైవ్‌షోలో జరిగిన అంశాన్ని అమరావతి ప్రజలందరికీ ఆపాదించడం తగదన్నారు. కెఎస్‌ఆర్‌ క్షమాపణ చెప్పినా పట్టించుకోకుండా, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరైందికాదన్నారు. ఈ రోజు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి జైలుకు పంపడమేగాక, చానెల్స్‌లో మాట్లాడటానికి వీలులేని భాషలో వైఎస్సార్‌సీపీ నాయకులపై కామెంట్లు చేస్తున్నారన్నారు. అధికారం కొల్పోయిన తర్వాత మీ పరిస్థితి ఎమిటో తెలుసుకోవాలని, కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటూ చెప్పే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి హామీలు గుప్పించి.. ఇపుడు చేతగాక చిన్న విషయాన్ని పట్టుకుని ప్రజల చూపు మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, పోరెడ్డిమహేశ్వరరెడ్డి, వేణుయాదవ్‌, విష్ణువర్థన్‌రెడ్డి, లక్షుమయ్య, జనార్దన్‌, తదితరులు పాల్గొన్నారు.

సాక్షి కార్యాలయాలపై దాడులు సిగ్గుచేటు

క్షమాపణ కోరినా దాడులు చేయడం దారుణం

ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement