ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Jun 11 2025 8:56 AM | Updated on Jun 11 2025 8:56 AM

ఏసీఏ

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏసీఏ సౌత్‌ జోన్‌ అండర్‌–19 వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు మంగళవారం ప్రారంభమయ్యాయి. కడప కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో చిత్తూరు, కడప జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు జట్టు 33.1 ఓవర్లలో 124 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 128 పరుగులు సాధించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని రణధీర్‌ రెడ్డి 54, రోహిత్‌ వర్మ 37 పరుగులు చేశారు.

ఏడు వికెట్ల తేడాతో కర్నూలు జట్టు విజయం

వైయస్‌ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టుపై కర్నూలు జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 48.1 ఓవర్లలో 176 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని కిన్ను కిషన్‌ 50 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మహిత్‌ 3, నౌసూన్‌ కళ్యాణ్‌ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 34.0 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 180 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ చెట్టులోని విఖ్యాత్‌ 66 పరుగులు చేశాడు.

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం1
1/2

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం2
2/2

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement