
ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి విడనాడాలి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
నాయకుడు రఘనాథరెడ్డి
కడప ఎడ్యుకేషన్ : ఎస్జీలటీకు వెబ్ కౌన్సెలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే విషయంలో ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి విడనాడాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వెబ్ కౌన్సెలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు అనే నినాదంతో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో దాదాపు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా 25 మంది నాయకులు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తన తీరు ఇప్పటికై నా మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతారన్నారు. పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో డీఈఓ కార్యాలయాల ముట్టడి జరిగినప్పటికీ ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కానీ ఎలాంటి చలనం రాకపోవడం దారుణం అని విమర్శించారు. కడప జిల్లా ఐక్యవేదిక నాయకుడు మోపురి వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఆలోచించి రేపు వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్బాషా, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు గుజ్జల తిరుపాల్, రమేష్బాబు, శంకర్రెడ్డి, ఇబ్రహీం, సంగమేశ్వర్రెడ్డి, కొండారెడ్డి, అబ్దుల్లా, ఖాదర్ బాషా, లెక్కల జమాల్ రెడ్డి, బత్తిని నాగేశ్వరరావు, అమరనాథరెడ్డి తదిరులు పాల్గొన్నారు.