
రోడ్డు ప్రమాదంలో ఫీల్ట్ అసిస్టెంట్లకు తీవ్ర గాయాలు
అట్లూరు : కడప–బద్వేలు ప్రధాన రహదారిపై లింగాలకుంట మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు పోరుమామిళ్ల మండలం రౌతుపల్లె ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బత్తిన రమణయ్య, పోరుమామిళ్ల మండలం గానుగపెంటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ రామమోహన్ ఇరువురు అట్లూరు మండలం కామసముద్రంలో జరిగే అంకాలమ్మ తిరునాలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా బద్వేలు వైపు నుండి కడపకు వెళ్తున్న కారు, ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. దీంతో ఇరువురు ఫీల్డ్ అసిస్టెంట్లు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.