
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
చాపాడు : మండలంలోని బద్రిపల్లె గ్రామానికి చెందిన ఏనుగు సావిత్రి (40) ఆదివారం కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న సావిత్రి ఈ నెల 3న పురుగుల మందు తాగింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త లక్ష్మీరెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
జర్మనీలో భారతదేశం
తరఫున ప్రాతినిధ్యం
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివిన పూర్వ విద్యార్థి భోగం హరీష్కుమార్ వరల్డ్ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈనెల 11వ తేదీన జర్మనీలో నీ కెమ్నిట్జ్లో వరల్డ్ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. భోగం హరీష్కుమార్ 83 కిలోల ఓపెన్ విభాగంలో పాల్గొననున్నారు. ఇతనికి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పవర్ లిఫ్టింగ్ కోచ్ బాల గోవిందు తివారి అభినందనలు తెలిపారు.
వడదెబ్బతో
ఉపాధి కూలీ మృతి
కమలాపురం : మండల పరిధిలోని కొండాయపల్లెకు చెందిన ఉపాధి కూలీ చిట్టిబోయిన ఓబులేసు (62) వడదెబ్బతో మృతి చెందినట్లు ఏపీఓ పార్థ సారధి తెలిపారు. శనివారం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఓబులేసు కళ్లు తిరుగుతున్నా యని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, వివాహిత కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం మృతుని నివాసానికి చేరుకుని మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు సాయినాథ శర్మ తనయుడు మణికంఠ శర్మ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వ్యక్తి ఆత్మహత్య
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణానికి చెందిన కుతుబుద్దీన్ (40) అనే వ్యక్తి విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణం రవిహాల్ వెనుక భాగంలో నివాసం ఉండే కుతుబుద్దీన్ రోజు వారి కూలికి వెళతాడు. వచ్చిన కూలి డబ్బులతో పూటుగా మద్యం తాగేసి కుటుంబాన్ని పట్టించుకొనేవాడు కాదు. దీంతో చేసేది లేక అతని భార్య తన నలుగురు పిల్లలతో కలసి వేరుగా కాపురం ఉంటోంది. దీంతో మనస్థాపానికి గురై శనివారం రాత్రి మద్యంతో పాటు విషద్రావణం తాగి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి