
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
తంబళ్లపల్లె : తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 48 ఎర్రచందనం దుంగలు, ఒక మోటార్ సైకిల్ను స్వాఽధీనం చేసుకున్నారు. టాస్కుఫోర్సు పోలీసుల కథనం మేరకు వివరాలు.. టాస్కుఫోర్సు డీఎస్పీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులు, ఆర్ఎస్ఐ మురళీధర్రెడ్డి బృందంగా శనివారం అటవీశాఖ అధికారులు జయప్రసాదరావు, మోహన్రెడ్డి, సబీన్తాజ్ల సహకారంతో వేపూరికోట ఫారెస్టుబీట్ పరిధిలో డంపింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె సమపంలోని వంకగట్టు వద్ద అనుమానాస్పదంగా పారిపోతున్న వారిని వెంబండించారు. ములకలచెరువు మండలం సోంపల్లి ఆర్.సుధాకర్(43), రాజుగారిపల్లెకు చెందిన ఈ.లక్ష్మిపతినాయుడు (27), పెద్దమండ్యం మండలం కురవపల్లెకు చెందిన మల్లికార్జున(39) గుర్రంకొండ మండలం మఽధ్యాహ్నంవారిపల్లెకు చెందిన సురేందరరెడ్డి (39) నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాలు తనిఖీ చేయగా 48 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని దీంతో పాటు ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. సీఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏరువమ్మ గుడిలో చోరీ
వీరబల్లి : మండలంలోని దిగువరాచపల్లి పంచాయతీ రాచపల్లి సమీపంలో ఉన్న ఏరువమ్మ దేవత గుడిలో శనివారం రాత్రి చోరీ చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి పూజలు చేసేందుకు వెళ్లగా ఆలయం తాళాలు పగులకొట్టి గుడిలో ఉన్న బీరువాను సైతం పగులగొట్టారు.
48 దుంగలు, మోటారు సైకిల్ స్వాధీనం