
ఉత్సాహంగా ఏసీఏ సౌత్ జోన్ క్రికెట్ టోర్నీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ – 23 వన్డే క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగింది. శనివారం జరిగిన మ్యాచ్లో చిత్తూరు, అనంతపురం జట్లు విజయం సాధించాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కర్నూలు జట్టుపై చిత్తూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 44.4 ఓవర్లలో 208 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని సాయి సూర్య తేజ 80, యజ్ఞేశ్వర్ 51 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని రెడ్డి ప్రకాష్ అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. తేజ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 23.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీనారాయణ 86 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తేజ రెడ్డి 62 పరుగులు చేశాడు.
వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో..
వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన వేరొక మ్యాచ్లో కడప జట్టుపై 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 35.2 ఓవర్లలో 151 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని ఎస్ఎండీ అయూబ్ 52, వాసు దేవరాజు 36 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 4, కామిల్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 22.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని అర్జున్ టెండూల్కర్ 78 పరుగులు చేశాడు. కడప జట్టులోని ఆదిల్ హుస్సేన్ 3 వికెట్లు తీసుకున్నాడు.

ఉత్సాహంగా ఏసీఏ సౌత్ జోన్ క్రికెట్ టోర్నీ

ఉత్సాహంగా ఏసీఏ సౌత్ జోన్ క్రికెట్ టోర్నీ