
వైభవం.. పల్నాటి అంకాలమ్మ బ్రహ్మోత్సవం
బి.కోడూరు : మండలంలోని రాజుపాళెంలో గల పల్నాటి అంకాలమ్మ దేవత బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చివరి ఘట్టమైన శుక్రవారం కంప తొక్కే కార్యక్రమాన్ని మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి దంపతులు హాజరై పూజలు జరిపారు. అనంతరం వారు సాంస్కతిక కార్యక్రమాలను తిలకించారు. డీసీ.గోవిందరెడ్డి మాట్లాడుతూ తిరునాలను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారని, ముళ్ల కంపలపై నడవడం విశేషంగా ఉంటుందని తెలిపారు. పవిత్ర కార్యక్రమాలను జరుపుకోవడం ఎంతో ఆనందమన్నారు. అనంతరం బండలాగుడు పోటీలను బద్వేల్ టీడీపీ ఇన్చార్జి రితీష్కుమార్ రెడ్డి, డీసీసీ బ్యాంకు ఛైర్మన్ ఎం.సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. విజేతలకు వారు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, మాధవరెడ్డి, ఓబుళరెడ్డి వెంకటరామిరెడ్డి, ఈశ్వర్రెడ్డి, కొండా వెంకటరామిరెడ్డి, కొండా రమణారెడ్డి, దేవినేని సుబ్బరామిరెడ్డి, కొండా వెంకటసుబ్బారెడ్డి, బోరెడ్డిచెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవం.. పల్నాటి అంకాలమ్మ బ్రహ్మోత్సవం