
పాత కక్షలతోనే ఆంజనేయులు హత్య
వీరపునాయునిపల్లె : పాత కక్షలతోనే అనిమెల ఆంజనేయులు హత్య జరిగిందని, ఆ కేసులో నిందితులను గురువారం సాయంత్రం అరెస్టు చేశామని పెండ్లిమర్రి సీఐ చల్లనిదొర తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వీరపునాయునిపల్లెకు చెందిన బెలుకూరు నవీన్, నరేష్లకు ఇంటి వద్ద గత పదేళ్లుగా తగాదా ఉండేదన్నారు. 2014లో అదే గ్రామానికి చెందిన బోగాధి చీనీ, నిమ్మ చెట్లను ఆంజనేయులు నరికి వేయగా, దీనిపై కేసు నమోదైందన్నారు. ఇటీవల నరేష్ కుటుంబీకులను ఆంజనేయులు బెదిరించడంతో అతడితోపాటు నవీన్, బోగాధి కలిసి ఆంజనేయులను హత్య చేయాలని భావించారు. బెలుకూరి రెడ్డిమహేష్ ఆంజనేయులు ఇంటికి వస్తున్న సమాచారాన్ని అందించాడు. దీంతో గత నెల 27న ఆంజనేయులు ఇంటికి వెళ్తుండగా.. కాపుకాసి రోకలిబండతో కొట్టి, పిడి బాకులతో పొడిచి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం 6.03 గంటలకు నిందితులను అదుపులోకి తీసుకొని నేరానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్ర వారం కమలాపురం కోర్టులో హాజరుపరచినట్లు తెలియజేశారు.
ముగ్గురు నిందితుల అరెస్టు