కొండాపురం : మండలంలోని యనమలచింతల గ్రామానికి చెందిన మండ్ల ప్రసాద్ చీనీ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు 41 చెట్లు శుక్రవారం నరికేశారని తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మండ్ల ప్రసాద్ చీనీ తోటలో 130 చీనీ మొక్కలు ఉన్నాయని, వాటిలో 41 మొక్కలను గురువారం నరికినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
గంజాయి విక్రేతల అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని దువ్వూరు రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎకై ్సజ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన మేరకు.. గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో ప్రొద్దుటూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సీవీ.సురేంద్రరెడ్డి, కడప ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.నీలకంఠేశ్వరరెడ్డి, సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడిలో హుస్సేన్ బాషా, సంతోష్, కార్తీక్లను అరెస్టు చేసి వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చీనీ చెట్ల నరికివేత