
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాణికుమారి (52) మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ39 ఏజెడ్ 2259 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు రాయచోటి వైపు నుంచి కడపకు వస్తుండగా ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొంది. ఇదే సమయంలో రాయచోటి వైపు నుంచి వస్తున్న ఏపీ 39 క్యూవీ 0525 నెంబర్ గల కారు వేగాన్ని అదుపుచేయలేక స్విఫ్ట్ డిజైర్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారులో స్వయంగా వాహనాన్ని నడుపుతున్న కడప రాఘవేంద్ర టౌన్షిప్లో నివాసం ఉంటూ రామాపురం మండలం సరస్వతిపల్లె ఎంపీపీ స్కూలు ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న రాణికుమారి అక్కడికక్కడే మృతి చెందారు. రాయచోటి వైపు నుంచి వస్తుండిన మరో కారులో ప్రయాణిస్తున్న రాయచోటి డిప్యూటీ డీఈఎంఓ అధికారి దేవశిరోమణితోపాటు కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన రాణికుమారికి భర్త పుల్లయ్య, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. రాణి కుమారి కారులో నుంచి హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ నరసింహులు బ్యాగులను స్వాధీనం చేసుకుని అందులోని సుమారు 50 తులాలకుపైగా బంగారు ఆభరణాలతో కూడిన రెండు బ్యాగులను చింతకొమ్మదిన్నె పోలీసులకు ఇచ్చారు. వారు వాటిని సంఘటన ప్రాంతంలోనే మృతురాలి బంధువులకు అప్పగించారు. గాయపడిన దేవశిరోమణి కడప నగరంలోని రాజారెడ్డి వీధి నివాసురాలు, ఈమె కారు డ్రైవర్ పెంచల బాబు కూడా కడపలోనే ఉంటున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోక పోవడం గమనార్హం. ఈ రోడ్డు ప్రమాదంపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాయచోటి డిప్యూటీ డీఈఎంఓ
దేవశిరోమణికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి