
దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు
వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి
పి.నరేన్రెడ్డి
పెండ్లిమర్రి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఇబ్బందులకు గురిచేయడం, దాడులకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పి,నరేన్ రామాంజులరెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దౌర్జన్యాలను సహించేంది లేదని హెచ్చరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారుల తీరుపై మండిపడ్డారు. పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ రైతు సర్దార్ హుస్సేన్ భూమిలో కంచె, రేకుల షెడ్ తొలగించిన ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సర్దార్ హుస్సేన్కు చెందిన పట్టా భూమిలో, భూమి పక్కన తమ ఆధీనంలో ఉన్న స్థలంలో రేకులషెడ్డు, కంచె ఏర్పాటు చేసుకున్నాడన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు రైతుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా జేసీబీ యంత్రంతో తొలగించడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ అనురాధకు ఫోన్ చేసి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని అడిగితే తాను అక్కడికి వచ్చి పరిశీలిస్తానని ఆమె చెబుతున్నారన్నారు. ఇప్పడు పరిశీలిస్తే ఏమి లాభమన్నారు. రైతుకు దాదాపు రూ.2 లక్షలు నష్టం జరిగిందని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రైతుకు అధికారులు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ తరపున ఎంతటి పోరాటానికై నా సిద్ధమన్నారు. కూటమి నేతల ఆగడాలు, భూకబ్జాల విషయంలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్ జోక్యం చేసుకొని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మాజీ మండల ఉపాధ్యక్షుడు నాగమల్లారెడ్డి, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సుబ్బారెడ్డి, శ్రీనువాసులురెడ్డి పాల్గొన్నారు.