
పారదర్శకంగా పోలీసుల బదిలీలు
కడప అర్బన్ : పారదర్శకత, నిబంధనలే ప్రామాణికంగా తీసుకుని పోలీస్ సిబ్బంది సీనియారిటీ ఆధారంగా వారు కోరుకున్న చోటికే జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ బదిలీ చేశారు. గురువారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ముగ్గురు ఏఎస్ఐలు, 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 104 మంది కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగడంతో సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, డీటీసీ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ జ్యోతి, సూపరింటెండెంట్లు, సిబ్బంది, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు.