
సతీష్ రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం
వేంపల్లె : వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిని గురువారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కలిశారు. వేంపల్లెలోని తన స్వగృహంలో ఉన్న సతీష్ రెడ్డితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోయేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం తమ బంధువుల వివాహా ఆహ్వాన పత్రికను సతీష్రెడ్డికి అందజేశారు. సతీష్ రెడ్డిని కలిసిన వారిలో కడప కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ, అజ్మతుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, వేంపల్లె మండల వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు మునీర్, షేక్షావలి, మాజీ ఉప సర్పంచ్ మునీర్, బాబా షరీఫ్, షామీర్ ఉన్నారు.