వైవీయూ : ప్రజాస్వామ్యానికి పునాది ప్రాథమిక హక్కులని, వాటి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం వైవీయూ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖ విభాగాధిపతి డాక్టర్ జి.పార్వతి ఆధ్వర్యంలో వైవీయూలో జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యూఢిల్లీ సహకారంతో మానవ హక్కులపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే మానవహక్కులు ప్రజలందరూ వినియోగించుకునేలా ఉండాలన్నారు. హక్కులతోపాటు బాధ్యతలను కూడా నిర్వర్తించడం ప్రథమ కర్తవ్యం అన్నారు. మానవహక్కుల అమలులో యూఎన్ఓ 2030 నాటికి ఏర్పరచుకున్న 17 లక్ష్యాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఆచార్య అమీరుల్లాఖాన్ మాట్లాడుతూ మనదేశంలో 10 కోట్ల మంది ఆకలి ఇబ్బందులతో ఉన్నారన్నారు. రీసోర్స్పర్సన్గా హాజరైన తిరుపతి ఎస్వీయూ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్యులు డాక్టర్ బి.వి.మురళీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, మానవహక్కులు అనే అంశంపై చారిత్రక సంఘటనల పట్ల అవగాహన కల్పించారు. సీనియర్ న్యాయవాది ఎం.చంద్రకాంతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్లు పని చేసే విధానాలు, ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో అవగాహన కల్పించారు. మానవ హక్కుల కార్యకర్త పి.వరలక్ష్మి మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగంలో చేర్చినట్లు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉంటే అక్కడ మానవహక్కులు అమలవుతున్నట్లని వివరించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ జి.పార్వతి మాట్లాడుతూ శిక్షణలో విలువైన అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ప్రమీళ మార్గరేట్, డాక్టర్ సతీష్బాబు, డాక్టర్ వినయ్కుమార్, డాక్టర్ రామయ్య, దామోదర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి పునాది ప్రాథమిక హక్కులు
Published Wed, Mar 29 2023 1:22 AM
1/1
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement