
ఎయిమ్స్లో రక్తదాన శిబిరం
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో మంగళవారం ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ విభాగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, నర్సింగ్ అధికారులు, పారా మెడికల్ సిబ్బంది, విద్యార్థులు 47మంది రక్తదానం చేశారు. అనంతరం వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్, డీన్ నితిన్ అశోక్జాన్, వైద్యులు సంగీత సంపత్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా తదితరులు పాల్గొన్నారు.