
బైక్కు నిప్పంటించిన దుండుగులు
అడవిదేవులపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు బైక్కు నిప్పంటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి అడవిదేవులపల్లి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్దండి కోటయ్య తన బైక్ను మంగళవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. బుధవారం ఉదయం లేచి చూడగా బైక్ కనిపించలేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లో బైక్ దగ్ధమవుతుండటం గమనించిన గ్రామస్తులు కోటయ్యకు సమాచారం ఇచ్చారు. కోటయ్య వెళ్లి చూడగా.. బైక్పై గడ్డి వేసి నిప్పంటించినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు.