సీఎంతో ముఖాముఖికి స్పందన అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

సీఎంతో ముఖాముఖికి స్పందన అంతంతే..

Jun 25 2025 3:05 PM | Updated on Jun 25 2025 3:05 PM

సీఎంత

సీఎంతో ముఖాముఖికి స్పందన అంతంతే..

మోత్కూరు, బొమ్మలరామారం : రైతు భరోసా సంబరాల్లో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు వేదికల నుంచి నిర్వహించి రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి రైతులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. జిల్లాలోని పలుచోట్ల రైతు వేదికలకు కొద్దిమందే రాగా కొన్నిచోట్ల అధికారులే కనిపించారు. దీంతో రైతు వేదికలు వెలవెలబోయి కనిపించాయి. మోత్కూరు మండలం అనాజిపురం, పాటిమట్ల, దత్తప్పగూడెం క్లస్టర్‌ రైతు వేదికల్లో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు రైతులు పదుల సంఖ్యలోనే హాజరయ్యారు. హాజరైన వారుకూడా మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయాచోట్ల పలువురు రైతులు తమకు పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు పడలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బొమ్మలరామారం మండలం రైతు వేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన చాలామంది రైతులు రైతు భరోసా రాలేదన్న ప్రశ్నలకే ఏఈఓలు సమాధానం చెప్పలేక దాటవేశారు. రైతు భరోసా జమకాని రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏమైన ప్రకటన చేస్తారేమోనని ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు.

సీఎంతో ముఖాముఖికి స్పందన అంతంతే..1
1/1

సీఎంతో ముఖాముఖికి స్పందన అంతంతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement