మోదీ పాలనలోనే దేశ పురోగతి | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలోనే దేశ పురోగతి

Jun 23 2025 6:57 AM | Updated on Jun 23 2025 6:57 AM

మోదీ పాలనలోనే దేశ పురోగతి

మోదీ పాలనలోనే దేశ పురోగతి

మోత్కూరు : ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్‌ కడియం రామచంద్రయ్య అన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా అవినీతి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం కోసం ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. సమావేశంలో జిల్లా నాయకులు ఏనుగు జితేందర్‌రెడ్డి, అండెం సుధాకర్‌రెడ్డి, భీముడి తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు లెల్లల బాలనర్సయ్య, రాదారపు మల్లేషం, ప్రధాన కార్యదర్శి వేముల దశరథ, మండల ఎస్సీ మోర్చా కొంపెల్లి గణేష్‌, కోశాధికారి కడమంచి సైదులు, కార్యదర్శి బత్తిని సతీష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు ఈట్టబోయిన ఆంజనేయులు, నల్లపోగుల వెంకన్న, కక్కరేను మల్లేష్‌, ముక్కాముల గణేష్‌, ఆళ్ల శివప్రసాద్‌, నిలిగొండ జయమ్మ, మార్గం సుజాత, మహేశ్వరం నిఖిత, కల్పన, మహేష్‌, మచ్చగిరి, నరేష్‌, అజయ్‌, మత్స్యగిరి, కిరణ్‌, మౌలానా తదితరులు పాల్గొన్నారు.

ఫ బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement