
స్వర్ణగిరిలో నేత్రపర్వంగా తిరువీధి సేవ
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం చేపట్టిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. అంతకుముందు సుప్రభావ సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన, నిత్య కళ్యాణం తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 5వేలమంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూరంతో మంగళహారతుల సమర్పించారు. సెలవు దినం కావడంతో ఆలయ మాడవీధులు భక్తులతో కిటకిటలాడాయి.