
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
పాఠశాలల్లో ఎకో క్లబ్ల
ఏర్పాటుకు సన్నాహాలు
ఫ జూలై 29వ తేదీ లోపు కమిటీలు
ఫ ఈ విద్యా సంవత్సరం ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరుతో ఏడు అంశాలపై ప్రచారం
ఫ పక్కాగా అమలయ్యేలా కార్యాచరణ
అవగాహన కల్పించే ఏడు అంశాలు ఇవే..
ఇంధన పొదుపు
నీటి పొదుపు
సింగిల్ యూజ్ వాడొద్దు
సుస్థిర ఆహార వ్యవస్థలు
వృథాను అరికట్టడం
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం
ఈ–వ్యర్థాలను
తగ్గించడం
భువనగిరి : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వివిధ అంశాలపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులను పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో వారిని భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఈ క్లబ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొత్త క్లబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం ఈ సంవత్సరం పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు నిర్ణయించారు.
వచ్చే నెలాఖరులోగా..
ఈ నెల 16 నుంచి వచ్చేనెల 29 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి టీచర్లను, పాఠశాల కమిటీ చైర్మన్ను క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు అంశాలకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు తీసి ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
ప్రతి స్కూల్ నుంచి ఒక కమిటీ
జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 35,558 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లు 156 ఉండగా వాటిలో 49,651 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు అంశాల్లో ఎకో క్లబ్లను భాగస్వామ్యం చేస్తారు.
జిల్లాలో పాఠశాలలు..
ప్రభుత్వ 715
విద్యార్థులు 35,558
ప్రైవేట్ స్కూళ్లు 156
విద్యార్థులు 49,651