ఆరు నెలలు.. 44,755 కేసులు | - | Sakshi
Sakshi News home page

ఆరు నెలలు.. 44,755 కేసులు

Jun 23 2025 6:57 AM | Updated on Jun 23 2025 6:57 AM

ఆరు న

ఆరు నెలలు.. 44,755 కేసులు

యాదగిరిగుట్ట : ట్రాఫిక్‌ ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అతివేగం, రాంగ్‌ రూట్‌, సిగ్నల్‌ జంప్‌, త్రిబుల్‌ రైడింగ్‌తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా, జరిమానా విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. యాదగిరిగుట్ట సర్కిల్‌ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మేల నెల వరకు కేవలం ఐదు నెలల్లోనే 44,755 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.

ఫైన్‌ వేయడంతో వచ్చిన ఆదాయం

ఐదు నెలల్లో 44,775 మందికి చలాన్లు విధించి, రూ.73,09,800 జరిమానా వేశారు. ఇందులో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ద్వారా రూ.4,59,000, నో పార్కింగ్‌ ప్రదేశంలో వాహనాలు నిలిపినందుకు రూ.2,96,400, యూనిఫామ్‌ ధరించనందుకు రూ.2,82,400, నంబర్‌ ప్లేట్‌లు సరిగా లేనందుకు రూ.4,15,600, సీట్‌ బెల్ట్‌ ధరించని వారికి రూ.16,90,100, ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం రూ.421000, ట్రిపుల్‌ రైడింగ్‌ రూ.7,46,400, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వాహనదారులకు రూ.63,000 జరిమానా విధించారు.

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ..

జనవరి నుంచి మే నెల వరకు పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 210 మంది పట్టుబడ్డారు. తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ వ్యక్తులకు కోర్టు జరిమానాతో పాటుగా, జైలు శిక్ష కూడా ఖరారు చేస్తుంది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తలెత్తే అనర్థాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

అతివేగం, రాంగ్‌రూట్‌, సిగ్నల్‌ జంప్‌

ఫ చలానాలు విధిస్తున్నా మారని వాహనదారులు

ఫ గుట్ట సర్కిల్‌ పరిధిలో జనవరి నుంచి రూ.73,09,800 జరిమానా

హెల్మెట్‌ ధరించని వారే ఎక్కువ

పోలీసులు విధించిన జరిమానాల్లో హెల్మెట్‌ ధరించని వారే ఎక్కువగా ఉన్నారు. వీరికి రూ.20,54,300 జరిమానాను విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తీరు మార్చుకోవడం లేదు.

రూల్స్‌ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి.ద్విచక్రవాహనదారులు డ్రైవింగ్‌ చేసే సమయంలో హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు.ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు. ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం.

–యెలగొండ కృష్ణ, ట్రాఫిక్‌ సీఐ, యాదగిరిగుట్ట

ఆరు నెలలు.. 44,755 కేసులు1
1/1

ఆరు నెలలు.. 44,755 కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement