
బడిబాటతో విద్యార్థుల సంఖ్య పెంచాలి
సాక్షి,యాదాద్రి : బడిబాట కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమై జూన్ 6నుంచి నిర్వహించే బడిబాట కార్యక్రమంపై సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విషయం, డిజిటల్ బోధన, సుశిక్షితులై ఉపాధ్యాయులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, డీఎంహెచ్ఓ మనోహర్, సంక్షేమ అధికారులు నరసింహారావు, యాదయ్య, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వీరారెడ్డి