
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్ ఆవరణలో జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, డీఆర్డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం అమలుపై సమీక్ష
రాజీవ్ యువ వికాసం అమలుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు హైదరాబాద్లోని సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ యవ వికాసం పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. కలెక్టర్ హనుమంత రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు.