
సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
తాళ్ళగడ్డ (సూర్యాపేట): వరి సాగులో అధిక దిగుబడికి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఐసీఏఆర్, భారత వరి పరిశోధనా సంస్థ–హైదరాబాద్ ప్రధాన శాస్త్రవేత్త బి. శ్రీదేవి అన్నారు. సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మంపహాడ్ గ్రామంలో గురువారం కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం కేవీకే శాస్త్రవేత్త నరేష్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అందిస్తున్న సేవలు, శిక్షణ కార్యక్రమాలను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. జీవ ఎరువులు, శిలీంధ్రనాశినిల గురించి రైతులకు తెలియజేశారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్. సుగంధి మాట్లాడుతూ.. చిరుధాన్యాలతో తయారుచేసే ఉత్పత్తుల గురించి రైతులకు వివరించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ముత్తయ్య, గ్రామ కార్యదర్శి కె. రేవతి, తుమ్మల రాము, వై. శ్రీను, కనకయ్య శంకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ది కమీషన్ల ప్రభుత్వం
ఫ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ది కమీషన్ల ప్రభుత్వంగా మారిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పరిపాలనపై గురువారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే డిజిటల్ లావాదేవీల్లో భారతదేశంలోనే 40 శాతం ఉండటం గర్వకారణమన్నారు. దేశంలో 80 శాతం మంది ప్రజలకు రేషన్ బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. 11 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ విజయాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో ప్రచారం చేయాలని కోరారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఒరిగింది శూన్యమన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని 16వ వార్డులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాసగౌడ్, పల్లెబోయిన శ్యాంసుందర్, వీరెల్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, రాములు, పకీర్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి