జాన్‌పహాడ్‌ దర్గా వద్ద అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

జాన్‌పహాడ్‌ దర్గా వద్ద అగ్నిప్రమాదం

May 27 2025 1:50 AM | Updated on May 27 2025 1:50 AM

జాన్‌పహాడ్‌ దర్గా వద్ద  అగ్నిప్రమాదం

జాన్‌పహాడ్‌ దర్గా వద్ద అగ్నిప్రమాదం

పాలకవీడు: మండల పరిధిలోని జాన్‌పహాడ్‌ దర్గా వద్ద సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదవశాత్తు దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పివేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్రి ప్రమాదం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. నాలుగు దుకాణాల్లో సుమారు రూ.5లక్షల విలువగల సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.

డివైడర్‌ ఢీకొని వ్యక్తి మృతి

నార్కట్‌పల్లి: డివైడర్‌ను బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి నార్కట్‌పల్లి మండల పరిధిలోని కామినేని ఆస్పత్రి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాండ్ర గ్రామానికి చెందిన ఎరుపుల ఉపేందర్‌ (31) అంబులెన్స్‌ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారీగా కామినేని ఆస్పత్రి వద్ద వాహనం నిలిపి, బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపారు.

కోనేరులో మునిగి

బాలిక మృతి

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసిన భక్తుల్లో, నీటి గుండంలో మునిగి బాలిక మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆవీర్‌ (7) అనే బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి, యాదగిరిగుట్టకు ఆదివారం వచ్చింది. ఈ క్రమంలో గుండంలో స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. వెంటనే బాలికను, యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నీళ్లు మింగడంతో బాలిక మృతి చెందిందని నిర్ధారించారు.

మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!

ఐఏఎస్‌ అంటూ డబ్బున్న

యువకులకు వలపు వల

బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.లక్షల్లో వసూలు

మిర్యాలగూడ అర్బన్‌: తాను డాక్టర్‌, ఐఏఎస్‌ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్‌మెయిల్‌ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమైపె మలక్‌పేట, చైతన్యపురి, ఉప్పల్‌, నల్లగొండ టూటౌన్‌, మిర్యాలగూడ వన్‌టౌన్‌, నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్‌ అంటూ హైదరాబాద్‌లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ పరిధిలో ఓ సీఐకి ఫోన్‌చేసి స్వీచ్‌ ఆఫ్‌ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్‌ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌ చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement