చెస్‌ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుంది | - | Sakshi
Sakshi News home page

చెస్‌ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుంది

May 26 2025 1:30 AM | Updated on May 26 2025 1:55 AM

చెస్‌

చెస్‌ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుంది

సూర్యాపేట: చెస్‌ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెంపొందుతుందని సూర్యాపేట జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లాస్థాయిలో బాలబాలికలకు(అండర్‌–11, 17 విభాగాల్లో) చెస్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి షీల్డ్‌లు, మెమొంటోలను గండూరి కృపాకర్‌ అందజేసి మాట్లాడారు. గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సతీష్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు శ్రీసాయికుమార్‌, సంయుక్త కార్యదర్శి గడ్డం లింగారెడ్డి, కోశాధికారి వెంకట మురళి, బాణాల వెంకటేశ్వర్లు, మాద రమేష్‌, ఎస్‌. మురళి, భిక్షం, సందీప్‌, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మూసీ నదికి పెరిగిన వరద

అర్వపల్లి: హైదరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జాజిరెడ్డిగూడెం శివారులోని మూసీ నదికి వరద పెరిగింది. దీంతో మూసీ నది నీటితో కళకళలాడుతోంది. మూసీ పరీవాహక గ్రామాల్లోని వ్యవసాయ బోర్లలో నీళ్లు పెరగడంతో వానాకాలం సీజన్‌కు సాగునీటి కొరత తీరనుంది.

చెస్‌ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుంది
1
1/1

చెస్‌ పోటీలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement