గురుకులాలు పేద విద్యార్థులకు వరం | - | Sakshi
Sakshi News home page

గురుకులాలు పేద విద్యార్థులకు వరం

May 26 2025 1:30 AM | Updated on May 26 2025 1:55 AM

గురుకులాలు పేద విద్యార్థులకు వరం

గురుకులాలు పేద విద్యార్థులకు వరం

మోత్కూరు: పేద విద్యార్థులకు గురుకులాలు వరంలాంటివని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. గురుకులాల్లో చదివిన మలావత్‌ పూర్ణ, సాధనాల ఆనంద్‌ 2014 మే 25న ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించడంతో ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా స్వేరో నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో మోత్కూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో విక్టరీ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జెడ్పీహెచ్‌ఎస్‌లు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదివి ప్రథమ, ద్వితీయ ర్యాంకులు పొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. తహసీల్దార్‌ మందుల నర్సయ్య పంపించిన ఇంగ్లిష్‌ డిక్షనరీలను సన్మానం పొందిన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన సమయంలో గురుకులాలను ఎంతో అభివృద్ధి చేశారని, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చారని పేర్కొన్నారు. స్వేరో నెట్‌వర్క్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎర్రవెల్లి నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్‌ అన్నెపు వెంకట్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొర్ర ఉప్పలయ్య, కనుకు రాజు, గజ్జెల్లి మహేష్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఫ రెడ్‌క్రాస్‌ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్‌ లక్ష్మీనర్సింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement