
చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో గల హనుమాండ్ల చెరువులో నుంచి కొందరు అక్రమార్కులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు నుంచి రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తరలించడంతో పాటు ఎఫ్టీఎల్ పరిధిలో గల భూములను పొలాలుగా మారుస్తున్నారు. కొందరు నాయకుల అండదండలతో అక్రమ మట్టి రవాణా సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తతంగంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తీసుకున్న చర్యలు శూన్యమని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలో మత్స్యకారులు..
హనుమాండ్ల చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతుండడంతో స్థానిక మత్స్య కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇష్టానుసారంగా చెరువులో మట్టిని తవ్వడంతో పాటు ఎఫ్టీఎల్ని పూడ్చివేతతో చెరువు విస్తీర్ణం తగ్గుతుందని వారు వాపోతున్నారు. మట్టి తవ్వకాలతో చెరువులో గోతులు ఏర్పడి నీరు నిలువదంటున్నారు.
ఫ నిబంధనలకు విరుద్ధంగా
ఎఫ్టీఎల్ పూడ్చివేత
ఫ ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు