ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

Apr 30 2025 12:53 AM | Updated on Apr 30 2025 12:53 AM

ఎక్స్

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

పంచాయతీ కార్మికుల విధుల్లో సడలింపు

భువనగిరిటౌన్‌ : ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ కార్మికులైన పారిశుద్ధ్య సిబ్బంది, మల్టీపర్పస్‌ వర్కర్ల విధుల్లో సడలింపు ఇచ్చింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు పనులు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలో పనులు పూర్తి కాకపోతే సాయంత్రం సమయంలో చేయించుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది.

యాదగిరి క్షేత్రంలో

విశేష పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు జరిపించారు.

ఆర్టీసీ బస్టాండ్‌ పరిశీలన

భువనగిరి: డిప్యూటీ ఆర్‌ఎంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుచరిత మంగళవారం భువనగిరి బస్టాండ్‌ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో ఉన్న దుకాణాల్లో తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌ను ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని డీఎంను ఆదేఽశించారు. ఆమె వెంట యాదగిరిగుట్ట డీఎం వెంకటయ్య, కంట్రోలర్‌ సోమరాజు, టీఐ శ్రీనివాస్‌, మణికంఠ ఉన్నారు.

వచ్చే నెలలో చిన్న తరహా ఖనిజాల బ్లాక్‌ల వేలం

భువనగిరిటౌన్‌ : వచ్చే నెలలో చిన్న తరహా ఖనిజాల బ్లాక్‌ల వేలం పాట నిర్వహిస్తున్నట్లు గనుల, భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు గోవిందరాజు తెలిపారు. వేలానికి సంబంధించి మంగళవారం కలెక్టరేట్‌లో గనులు, భూగర్భ శాఖ హైదరాబాద్‌ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏమైన సందేహాలు ఉంటే 98666 33414 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

నేడు మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

భువనగిరిటౌన్‌ : కలెక్టరేట్‌లో బుధవారం మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10:00 గంటలకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హనుమంతరావు పాల్గొంటారని తెలిపారు.

యాదగిరిగుట్ట: ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీల్లో కార్మికులకు భద్రత లేకుండా పోతోంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. పరిశ్రమల్లో తనిఖీలు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వెరసి భారీ ప్రమాదాలు సంభవించి కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మంగళవారం మోటకొండూర్‌ మండలంలోని కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.

ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీ..

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూర్‌, బొమ్మలరామారం, టంగుటూరు, మొటకొండూర్‌ మండలం కాటేపల్లిలో పేలుడు పదార్థాల (ఎక్స్‌ ప్లోజివ్స్‌) కంపెనీలు ఉన్నాయి. ఆయా ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమల్లో తయారు చేసిన డిటోనేటర్లు, ఫ్యూజ్‌ వైర్లు, డీఆర్డీఏ, శ్రీహరికోటతో పాటు ఆర్మీ, నావికాదళం వంటి సంస్థలతో పాటు ఇక్కడి నుంచి పేలుడు పదార్థాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. దీంతో ఆయా కంపెనీల్లో కార్మికులు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తుంటారు. కంపెనీల యాజమాన్యాలు సైతం వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులతో పాటు, జిల్లా అధికారులు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టాలి. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీ చేయడానికి వస్తున్న అధికారులు.. పటిష్ట చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించడంలో అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..

ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ఇలా..

ఫ 2012లో పెద్దకందుకూర్‌లోని ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో సీ– 6 బ్లాక్‌ లో మొదటిసారిగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆలేరు ప్రాంతానికి చెందిన ఎల్లయ్య, వంగపల్లి ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్‌ అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

ఫ 2019లో జరిగిన మరో పేలుడు ఘటనలో పెద్దకందుకూరు గ్రామానికి చెందిన జయపాల్‌ అనే కార్మికుడు మృతి చెందాడు.

ఫ 2020లో పరిశ్రమలోని ఫ్యూరింగ్‌ బిల్డింగ్‌ లో పేలుడు ప్రమాదం సంభవించగా, అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా.. రెండు సార్లు పీఆర్డీసీ బ్లాక్‌ లోనే ప్రమాదాలు కావడం గమనార్హం.

ఫ ఈ ఏడాది జనవరి 4న పెద్దకందుకూర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో జరిగిన పేలుడులో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో బయట పడగా.. మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.

వివాహమై

ఆరు నెలలు ..

మోటకొండూర్‌: ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో జరిగిన పేలుళ్లలో కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్‌(30) మృతిచెందాడు. ఇతడి వివాహం గత నవంబర్‌లో జరగగా.. ఆరు నెలలు కాకుండానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. అతడి భార్య మూడు నెలల గర్భిణి. కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజీవ్స్‌ కంపెనీ ప్రారంభం నుంచి సందీప్‌ అక్కడే పనిచేస్తున్నాడు. ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. కాగా.. సందీప్‌ తండ్రి శ్రీనివాస్‌ గత మూడు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను, కుమారుడిని కోల్పోయిన మంగమ్మ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

ఆత్మకూరు(ఎం)లో

విషాదఛాయలు

ఆత్మకూరు(ఎం): ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌లో జరిగిన పేలుళ్లలో ఆత్మకూర్‌ మండల కేంద్రానికి చెందిన కల్వల నరేష్‌(32) మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మండల కేంద్రానికి చెందిన కల్వల అంజయ్య– లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు నరేష్‌ ఉన్నాడు. ఇతడికి వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన యువతితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. నరేష్‌ గత రెండు సంవత్సరాలుగా ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం పగలు డ్యూటీ కావడంతో ఉదయమే వెళ్లాడు. పేలుళ్లతో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఒక్క కొడుకూ..

మృతిచెందడంతో..

మోటకొండూర్‌ మండల కేంద్రానికి చెందిన బుజ్జమ్మ కుమారుడు దేవిచరణ్‌. కొంత కాలం క్రితమే భర్తను కోల్పోవడంతో కుట్టుమిషన్‌ కుడుతూ కుమారుడిని ఇంటర్‌ వరకూ చదివించింది. అనంతరం దేవిచరణ్‌ కాటేపల్లిలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో చేరాడు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న సమయంలో కుమారుడు మృతిచెందడంతో తల్లి బుజ్జమ్మ రోదనకు అంతులేకుండా పోయింది.

భువనగిరి పట్టణంలోని కుమ్మరివాడ మీదుగా వెళ్తున్న ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య మట్టి పాత్రలను చూసి అక్కడ కొద్దిసేపు ఆగారు. అక్కడే వంట పాత్రలను కొనుగోలు చేశారు. మట్టి పాత్రల్లో ఏ వంట చేసినా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.

– భువనగిరిటౌన్‌

రామన్నపేట నుంచి కక్కిరేణి మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రయాణికులతో కలిసి బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు.

– రామన్నపేట

మట్టి పాత్రలు కొనుగోలు చేస్తున్న

ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

బస్సు సర్వీస్‌ ప్రారంభించిన అనంతరం

అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే వీరేశం

న్యూస్‌రీల్‌

ఫ కనీస రక్షణ చర్యలు చేపట్టని

కంపెనీల యాజమాన్యాలు

ఫ తనిఖీలు చేపట్టని అధికారులు

ఫ గాల్లో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు

ఫ తాజాగా మోటకొండూర్‌ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్‌

ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు

ఫ ముగ్గురు కార్మికులు మృతి,

ఆరుగురికి తీవ్ర గాయాలు

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు1
1/7

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు2
2/7

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు3
3/7

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు4
4/7

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు5
5/7

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు6
6/7

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు7
7/7

ఎక్స్‌ప్లోజివ్స్‌లో తరచూ పేలుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement