
ధాన్యం కొనాలని రైతుల ఆందోళన
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం వలిగొండ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులు గడిచినా కాంటా ప్రారంభించడం లేదన్నారు. హమాలీల కొరతను కేంద్రాల నిర్వాహకులు సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నామని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రేపటిలోగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతులకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లోతుకుంట ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో పాటు బీజేపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్, నాయకులు రాచకొండ కృష్ణ, శీల పాండు, అనిల్మార్, దోగిపర్తి సంతోష్, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పాల్గొన్నారు.