మిర్యాలగూడ అర్బన్: చెత్త కుప్పకు నిప్పుపెట్టడంతో పక్కనే నిలిపి ఉంచిన అంబులెన్స్ స్వల్పంగా దగ్ధమైన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు మినీ రవీంద్రభారతి ఎదురుగా చెత్తకుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం నిప్పుపెట్టగా పక్కనే నిలిపి ఉంచిన అంబులెన్స్ టైర్లు, వెనక భాగం కాలిపోయింది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందిచటంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. దీంతో పక్కన నిలిపి ఉంచిన మరికొన్ని అంబులెన్స్లకు పెను ప్రమాదం తప్పింది.