
సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన జరిగి మంగళవారం నాటికి ఏడాది పూర్తయింది. ఇంకా భక్తులకు సరైన వసతులు సమకూరడం లేదు. రూ.1200 కోట్ల వ్యయంతో ఆలయ నగరి పూర్తి చేశారు. గత ఏడాది మార్చి 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ఉద్ఘాటన జరిగింది. ఆరేళ్ల తర్వాత స్వయంభూల దర్శనం కలగడంతో దేశ, విదేశీ భక్తులు పెద్ద ఎత్తున శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అసౌకర్యాల నడుమనే స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఇవీ.. ప్రధాన సమస్యలు
● రూ.11 కోట్ల దాతల నిధులతో చేపట్టిన అన్నప్రసాద వితరణ కేంద్రం పనులు ఇంకా సాగుతున్నాయి. దీక్షాపరుల మండపంలో రోజూ వెయ్యి మంది భక్తుల వరకు అన్నప్రసాదం అందిస్తున్నారు.
● పార్కింగ్ ప్రాంతాల్లో నీడ లేదు. వేలాది మంది భక్తులు సొంత వాహనాల్లో గుట్టకు చేరుకుంటున్నారు. పార్కింగ్లో తమ వాహనాలను నిలిపి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సుల కోసం ఎండ, వానలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
● రూ.50 కోట్లతో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు. గిరిప్రదర్శన మార్గం 2.7 కి.మీ అస్తవ్యస్తంగా ఉంది. వర్షాలకు దెబ్బతిన్నది.
● వ్యాపార సముదాయాల కోసం నిర్మిస్తున్న కాంప్లెక్స్, దేవస్థానం బస్టాండ్, కొండపైన రూ. 1.07 కోట్లతో చేపట్టిన బస్ బే పూర్తి కాలేదు. భక్తులకు కొండపైన ఎలాంటి వసతులూ లేవు. సంగీతభవన్ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
● దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులకు నిలువ నీడలేదు. ఆలయం ఆవరణలో కూర్చునే పరిస్థితి లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
● ప్రెసిడెన్షియల్ సూట్లను అత్యాధునిక వసతులతో నిర్మించారు. వీటిని భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. 14 విల్లాల్లో 70 సూట్ గదులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బస చేసే భక్తులకు క్యాంటీన్ సౌకర్యం లేదు.
● దేవస్థానం మొదట్లో నడిపిన విధంగా 45 ఆర్టీసీ బస్సులను ఆర్థిక భారంతో 20కి తగ్గించారు. దీంతో భక్తులు పరిమితికి మించి బస్సులలో ప్ర యాణం చేస్తున్నారు.
పెద్దగుట్టపై వసతుల గదులేవీ..
● పెద్దగుట్టపై భక్తుల వసతుల కోసం నిర్మించ తలపెట్టిన అధునాతన వసతి గృహాల నిర్మాణం పూ ర్తి కాలేదు. 250 ఎకరాల్లో లే అవుట్ చేశారు. విరాళాలు వస్తే తప్ప పూర్తిచేసే పరిస్థితి లేదు.
పెరిగిన భక్తుల సంఖ్య
ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రముఖులు, విదేశీ యులు సైతం పెరిగారు. ఆస్ట్రేలియా, ఇటలీ, అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా దేశస్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ హుండీల ఆదా యం రికార్డు స్థాయిలో రూ.2కోట్లు దాటింది.
ఆలయ తిరువీధుల్లో భక్తుల రద్దీ (ఫైల్)
ఎన్నో మార్పులు..
యాదగిరిగుట్ట: ఈ ఏడాది యాదాద్రి ఆలయంలో నూతన కార్యక్రమాలకు సైతం ఆచార్యులు, అధికారులు శ్రీకారం చుట్టారు. విశేష పూజలను ప్రారంభించారు. జూలైలో శ్రావణ మాసం సందర్భంగా కోటి కుంకుమార్చన పూజలను తొలిసారిగా చేపట్టారు. అక్టోబర్ 31న బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. రూ.300 టిక్కెట్ రుసుముతో ఉద యం 9 నుంచి 10 గంటలకు, సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు ఇంటి నుంచే బుకింగ్ చేసుకునేలా ఆన్లైన్ పూజల టిక్కెట్ సేవలను ప్రారంభించారు. ఇక కొండ కింద గల తులసీ కాటేజీలో రూ.21కోట్ల వ్యయంతో నిర్మించిన 240 గదుల సముదాయాన్ని జనవరి 2న మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీష్రెడ్డి, విప్ సునీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు ప్రా రంభించారు. గండిచెరువు సమీపంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్, సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని ప్రారంభించారు. కొండపై కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కె మెరాలను ప్రారంభించి,నిత్యం వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటనకు నేటికి ఏడాది
ఫ పెరుగుతున్న భక్తుల సంఖ్య
ఫ అసౌకర్యాలతో సతమతం
ఫ ఇప్పటికీ కొనసాగుతున్న పనులు

కొనసాగుతున్న అన్నప్రసాద సత్రం పనులు

నిర్మాణం పూర్తికాని మొదటి ఘాట్రోడ్డు

కొండపై కమాండ్ కంట్రోల్ రూం (ఫైల్)