మెడ నుంచి తల వరకు నీలం రంగులో, తలపై పెద్ద కొప్పు, బారెడు తోకతో ఆకట్టుకుంటోంది ఈ అరుదైన పక్షి. బయన్నగూడెంలోని ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మద్దు బాల నాగేశ్వరరావు ఇంటి ప్రాంగణంలోని నేరేడు చెట్టును కొద్దిరోజులుగా ఆవాసంలా మార్చుకుని సంచరిస్తోంది. నేరేడు పండ్లు ఆరగిస్తూ సందడి చేస్తోంది. దీని శాసీ్త్రయ నామం ఆసియన్ పార్యరడైజ్ ఫ్లైక్యాచర్ అని.. మగ పక్షులకు మాత్రమే తోక ఉంటుందని ఆర్నికాలజీ (పక్షి శాస్త్రం)పై అధ్యయనం చేసిన ఎం.తేజవిశ్వనాథ్ తెలిపారు.
–కొయ్యలగూడెం


