
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ అష్టమి తిధి కావడంతో నామమాత్రంగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట తదితర విభాగాల్లో భక్తుల రద్దీ స్వల్పంగా కనిపించింది. ఆదివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సెప్టెంబరు 13న
జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (టూటౌన్): సెప్టెంబర్ 13వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసధన్ భవన్ నందు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, వాహనం ప్రమాద బీమా, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ వివాదాలు, టెలిఫోన్ బకాయిలు, చిట్ ఫండ్ కేసులు, అమలు పిటీషన్లు (ఇ.పి) రాజీ చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలోగానీ, మరి ఏ ఇతర సమస్యలు ఎదురైన 15100 లేదా 08812 224555ను సంప్రదించాలన్నారు.

శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం