
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
నరసాపురం: కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం నరసాపురం మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని మండల అధ్యక్షుడు ఉంగరాల రమేష్నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముదునూరి మాట్లాడుతూ కార్యకర్తల త్యాగాలను పార్టీ అధినేత వైఎస్ జగన్ మరిచిపోలేదన్నారు. కార్యకర్తలు ఏమాత్రం అధైర్య పడొద్దని, ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి పాలన ఏడాదిలోనే ప్రజావిశ్వాశాన్ని కోల్పోయిందన్నారు. గత ప్రభుత్వంలో స్వర్ణయుగాన్ని చూసి ప్రజలు నేడు పలు అవస్థలు పడుతున్నారన్నారు. విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, యు వత, రైతులు ఇలా అన్ని వర్గాలూ జగన్ని ఎందుకు ఓడించమనే ఆలోచనలో పడ్డాయన్నారు.
హామీలపై నోరు మెదపరే?
ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మాజీ సీఎం జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారని ముదునూరి మండిపడ్డారు. రైతు భరోసా రూ.20 వేలు, మహిళలకు ఉచిత బస్సు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్లకే ఫించన్, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు మొఖం చాటేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 68 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇప్పుడు 60 లక్షల మందికే పరిమితం చేశారన్నారు. అలాగే ఏడాదిలోనే ప్రజలపై రూ.16 వేల కోట్లు విద్యుత్ భారాలను మోపారన్నారు. సూపర్సిక్స్ హామీలను గాలికి వదిలేశారన్నారు. కూటమి మోసాలను ప్రజలకు వివరించే బృహత్తర బాధ్యత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
ప్రాజెక్టులను పట్టించుకోరా..
నరసాపురం నియోజకవర్గంలో రూ.650 కోట్లతో వశిష్ట వంతెన, రూ.400 కోట్లతో ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ వంటి ప్రాజెక్టులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకువస్తే కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని ముదునూరి ప్రశ్నించారు. పక్కా జీఓలతో, నిధులు మంజూరు చేయించిన ప్రా జెక్టులు పూర్తి చేసి ఆ ఘనతను కూటమి నాయకులే పొందచ్చు కదా అని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న మాట్లాడుతూ జగన్ ఆందోళనలు తర్వాతే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసిందన్నారు. పార్టీ అ గ్నికుల క్షత్రియ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమాని నాగరాజు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, జెడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరు మాని బాబ్జి, స్టేట్ మైనార్టీ సెల్ అఫీషియల్ స్పోక్స్పర్సన్ షేక్ బులిమస్తాన్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బందన పూర్ణ, నరసాపురం ఎంపీపీ మైలాబత్తుల సోనీ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పోలిశెట్టి గోపీ, స్టేట్ పబ్లిసిటీ విభాగ కార్యదర్శి ఇంజేటి జాన్ కెన్నడీ మాట్లాడారు. ఈపార్టీ నేతలు వైకేఎస్, పప్పుల రామారావు, కొల్లాబత్తుల రవి, కడలి రాంబాబు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హామీలతో ఊదరగొట్టి.. అధికారంలోకొచ్చాక గాలికొదిలేశారు
ఏడాదిలోనే కూటమి సర్కార్ ప్రజావిశ్వాసం కోల్పోయింది
కార్యకర్తలు అధైర్య పడొద్దు.. రానున్న రోజులు మనవే
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు