మున్సిపల్‌ కార్మికుల గోడు పట్టదా? | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్మికుల గోడు పట్టదా?

Jun 28 2025 8:59 AM | Updated on Jun 28 2025 8:59 AM

మున్సిపల్‌ కార్మికుల గోడు పట్టదా?

మున్సిపల్‌ కార్మికుల గోడు పట్టదా?

భీమవరం(ప్రకాశం చౌక్‌): చాలిచాలనీ జీతంలో జీవనం కష్టం మారింది.. కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం.. అంటున్న మున్సిపల్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల ఆవేదనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీరి సమస్యల పరిష్కారానికి దయ చూపడం లేదు. పలు మార్గాల్లో నిరసనలు, ఆందోళనలు తెలిపిన కార్మికులకు గత్యంతరం లేక సమ్మెబాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా భీమవరం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు దీక్షలు చేపట్టి నిరసన తెలుపుతున్నారు. భీమవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆరు రోజులగా ఇంజనీరింగ్‌ విభాగంలోని ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, వాటర్‌ వర్క్స్‌ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. పట్టణంలో రోడ్ల నిర్వహణ, తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో వీరి సేవలు కీలకం. వీరంతా సమ్మెలో ఉండటంతో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

కూటమి ప్రభుత్వ వంచన

తాము అధికారంలోకి వస్తే మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో కూటమి నాయకులు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన తల్లికి వందనం పథకం ఇంజనీరింగ్‌ కార్మికులు అందలేదు. భీమవరం మున్సిపాలిటిలో 65 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా తల్లికి వందనం పథకానికి అర్హులైనా అమలు చేయలేదు.

కార్మికులు.. అప్పులపాలు

కార్మికులకు కటింగ్‌లు పోను వచ్చే వేతనాలు కుటుంబపోషణ, పిల్లల చదువులకు సరిపోక పోవడంతో వీరు అప్పులపాలవుతున్నారు. రోజురోజుకూ పెరుగుపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, స్కూల్‌ ఫీజులు, ఇతర కుటుంబ ఖర్చుల భారంగా మారాయి.

బడుగులు.. కుదేలు

సమ్మెలోనే మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు

ఆరు రోజులుగా దీక్షలు, నిరసనలు

ఉద్యోగ భద్రత, వేతనాల పెంపునకు డిమాండ్‌

సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ప్రధాన డిమాండ్లు

కార్మికులకు టెక్నికల్‌ జీతం రూ.29,200, నాన్‌ టెక్నికల్‌ రూ.24,500 అమలు చేయాలి.

కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వాలి.

హెచ్‌ఆర్‌ పాలసీ పరిధిలోకి తీసుకురావాలి

కార్మికులందరికీ మినిమం టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలి

అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి సర్వీసు బట్టి 6 శాతం ఇంక్రిమెంట్‌తో జీతం పెంచాలి.

రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ కింద కార్మికులకు రూ. 10 లక్షలు, నెలకి పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలి.

కారుణ్య నియామకాలు అమలుచేయాలి

కార్మికులకు గ్రాట్యూటీ ఇవ్వాలి

జాతీయ పండుగలు, క్యాజువల్‌ లీవ్‌లు, వారాంతపు సెలవులు అమలు చేయాలి.

హెల్త్‌కార్డులు, ఏడాదికి 30 మెడికల్‌ లీవ్‌లు మంజారు చేయాలి.

రిటైర్మెంట్‌, చనిపోయినా, అనారోగ్యం పా లైతే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement