
పారిశుద్ధ్య నిర్వహణపై శ్రద్ధ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారాం క్యాంపు కార్యాలయం నుంచి భవ్య భీమవరం, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కుల అభివృద్ధి, రోడ్ల ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. భీమవరంలో దాతల సహకారంతో చేపట్టిన పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. అనుమతులు లేని హోర్డింగ్లు తొలగించాలని, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు గుర్తించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించమన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి పార్థసారథి, అధికారులు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు
84 శాతం హాజరు
భీమవరం: జిల్లాలోని మూడు కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 84 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ శుక్రవారం తెలిపారు. ఉదయం 360 మందికి 303 మంది, మధ్యాహ్నం 360 మందికి 305 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.