సాక్షి, భీమవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ కొట్టు సత్యనారాయణ బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికార కూటమి సాగిస్తున్న అరాచకాలపై అధినేతతో చర్చించారు. ప్రజలకు అండగా ఉండాలని జగన్ సూచించినట్లు కొట్టు తెలిపారు.
వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల్లో నియామకాలు
ఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగం అనుబంధ సంస్థ ఆర్టీఐ విభాగం కార్యదర్శిగా ఉండికి చెందిన బడుగు బాలాజీ, పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పడాల కిషోర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ర్యాలీ
భీమవరం(ప్రకాశం చౌక్): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెలో భాగంగా 3 రోజు బుధవారం మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వారి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా తిరిగి వెళ్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగించారు. కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అధినేతతో భేటీ

మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ర్యాలీ