ఆక్వా రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతులను ఆదుకోవాలి

Jun 25 2025 1:13 AM | Updated on Jun 25 2025 1:13 AM

ఆక్వా రైతులను ఆదుకోవాలి

ఆక్వా రైతులను ఆదుకోవాలి

గణపవరం: తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ఆక్వా రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం గణపవరం, పిప్పర, కేశవరం, సరిపల్లె, కొత్తపల్లి, ముప్పర్తిపాడు, జల్లి కాకినాడ, తదితర గ్రామాల్లో ఆక్వా రైతులకు గ్రామ సభలు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రైతులు గిట్టుబాటు ధర, విద్యుత్‌ సబ్సిడీ, ఆక్వా జోన్‌ వర్తింపు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నాన్‌ ఆక్వా జోన్‌లో ఉన్న రైతులు ఆక్వా జోన్‌లోకి మారడానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులు సాగులో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. గణపవరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన సదస్సులో సర్పంచ్‌ మూర అలంకారం, ఎఫ్‌డీవో శివ రామకృష్ణ, సహాయకురాలు షర్మిల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement