
● మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.2,15,016 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారని ఈవో తెలియజేశారు.