
బెల్టుషాపులపై దాడి
నూజివీడు: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పలు మండలాల్లో సిబ్బంది సోమవారం దాడులు చేసి 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. ఆగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన మల్లెల శివనాగరాజు వద్ద 10 మద్యం సీసాలు, ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన పలగాని విమల వద్ద 10 మద్యం సీసాలు, చెక్కపల్లికి చెందిన చెంగల వెంకటేశ్వరరావు వద్ద 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్టుషాపులకు మద్యంను సరఫరా చేస్తే సంబంధిత షాపుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలన్నారు. అలాగే బెల్టుషాపుల నిర్వహణకు అనుమతులు లేవని, బెల్టుషాపులు నిర్వహించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మళ్లీ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు ఎస్పీ వి.భీమారావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను అదనపు ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, పూర్తిస్థాయి విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. పలు సమస్యలపై మొత్తం 17 అర్జీలను అదనపు ఎస్పీ స్వీకరించారు.
గర్భిణిఅనుమానాస్పద మృతి
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఏలూరు శ్రీరామ్నగర్ 9వ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తోన్న కాళిదాసు దేవి(30) భర్తతో కలిసి జీవిస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు సమాచారంతో ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆదేశాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గర్భిణీ ఆత్మహత్యపై సందేహాలు వ్యక్తం కావటంతో త్రీటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని త్రీటౌన్ పోలీసులు తెలిపారు.
ఉపాధి కూలీలకు బెదిరింపులపై ఫిర్యాదు
ఏలూరు (టూటౌన్): ఉపాధి హామీ కూలీలను బెదిరించి, ఇబ్బంది పెట్టిన బీజేపీ నాయకులు, జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొయ్యలగూడెంలో రోటరీ క్లబ్లో బీజేపీ నిర్వహించిన సమావేశం సందర్భంగా బెదిరించి ఉపాధి హామీ కూలీలు సుమారు 200 మందిని బీజేపీ సమావేశానికి తీసుకెళ్లారన్నారు. ఆ సమావేశంలో బీజేపీ కరపత్రాలు పంపిణీ చేసి, ఆ పార్టీ కండువాలు ఇష్టం లేకపోయినా బలవంతంగా మెడలో వేసిన బీజేపీ నాయకులపై, బెదిరింపు చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.