ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతిభ

Jun 24 2025 3:18 AM | Updated on Jun 24 2025 3:18 AM

ఫ్రైడ

ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతిభ

ఏలూరు(మెట్రో): జూన్‌ 16న బ్రిటన్‌ నుంచి ఫ్రాన్స్‌ వరకు 34 కి.మీ. ఇంగ్లిష్‌ చానల్‌ను ఆరుగురి బృందంతో కూడిన ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా ఎ టీమ్‌ స్విమ్మింగ్‌ చేస్తూ 13 గంటల 37 నిమిషాలు వ్యవధిలో విజయవంతంగా ముగించారు. ఏలూరుకు చెందిన బలగ గణేష్‌ కూడా ఆ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బలగ గణేష్‌ను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అభినందించారు. గణేష్‌ ఏప్రిల్‌ 18న శ్రీలంక నుంచి ఇండియా వరకు 28 కి.మీ దూరం పాక్‌ జలసంధిని 10 గంటల 30 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసి తెలుగు రాష్ట్రాల్లోనే మొట్ట మొదటి పారా స్మిమ్మర్‌గా రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు. గణేష్‌ను అభినందించిన వారిలో జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి, డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు, డీఎస్‌డీవో బి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

తాడిచెట్టు కూలి ఇల్లు ధ్వంసం

దెందులూరు : గాలాయగూడెంలో ఆదివారం రాత్రి భారీ ఈదురు గాలులకు పెండ్లి ఇస్సాకు ఇంటిపై తాడిచెట్టు పడింది. తాడిచెట్టు పడే సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికి ఏమీ కాకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.

కూలిన భారీ వృక్షం

భీమడోలు: ఆదివారం రాత్రి వీచిన గాలి వానకు పలు గ్రామాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. మండల వ్యాప్తంగా చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. విద్యుత్‌ తీగలపై పడడంతో పలు చోట్ల కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుండుగొలను సంతమార్కెట్‌ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో విద్యుత్‌ వైర్లు తెగి గ్రామంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం నెలకొంది. తీగలు తెగడంతో విద్యుత్‌ శాఖ అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు చర్యలు చేపట్టింది. పంచాయతీ, విద్యుత్‌ శాఖ అధికారులు చెట్టును తొలగించి విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నారు.

ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతిభ 
1
1/2

ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతిభ

ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతిభ 
2
2/2

ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement