
మహమ్మారి.. మరోసారి!
రేపు క్యాంపస్ డ్రైవ్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు ప్రభుత్వ ఐటీఐ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్లో ఈనెల 11న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 08812–230269లో సంప్రదించవచ్చు.
మంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, భీమవరం : 2020 మార్చిలో కరోనా వైరస్ బయటపడటంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెదకుండా లాక్డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఎక్కడికక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, డోర్ టూ డోర్ ఫీవర్ సర్వేలు నిర్వహించి 15 రోజులు పాటు కోవిడ్ సెంటర్లు, హోం ఐసోలేషన్లో ఉంచేవారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 34 వాహనాల ద్వారా లక్షలాది మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. పాజిటివ్ నమోదైతే వెంటనే రెడ్ జోన్ ప్రకటించి.. వారి కుటుంబాలకు అండగా నిలబడింది నాటి ప్రభుత్వం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, 46 కోవిడ్ సెంటర్లలో 25 వేల బెడ్లు సిద్ధం చేసి వైరస్ తీవ్రత అధికంగా ఉన్న వారికి ఉచితంగా వైద్యసేవలు, పౌష్టికాహారాన్ని అందించింది. కోవిడ్ బాధితులను 108 అంబులెన్స్ల ద్వారా ఆస్పత్రులు, కోవిడ్ సెంటర్లకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా హోం ఐసోలేషన్లో ఉన్న వారికి పౌష్టికాహారం, మందులు అందించారు. వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.
సెకండ్ వేవ్లో..
సెకండ్ వేవ్లో వైరస్ విజృంభణ అధికంగా ఉండటంతో సహాయక చర్యలు మరింత తీవ్రతరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 8 ఆక్సిజన్ ప్లాంట్లు నుంచి నిరంతర ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆహార ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 చొప్పున్న ఆర్థిక సాయం అందించడంతో పాటు ఒక్కొక్కరికీ ఐదు కిలోలు చొప్పున 15 రోజులకు ఒకసారి రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది.
సమర్థవంతంగా వ్యాక్సినేషన్
వ్యాక్సినేషన్ను అధికార యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహించారు. తొలుత ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందించారు. అపోహలతో మొదట్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సత్ఫలితాలను సాధించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. అందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఇంటింటికీ వెళ్లి కోవిడ్ వ్యాక్సినేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది.
ఇళ్లలో తలదాచుకున్న నాటి విపక్ష నేతలు
నాడు విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అప్పట్లో బాధితులపై వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ముఖ్య నేతలు సైతం హైదరాబాద్లోని ఇళ్లకే పరిమితమయ్యారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. సేవా కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులకు అందజేసేవారు.
వెలుగు చూస్తున్న కోవిడ్ కేసులు
ఇప్పటికే మూడు విడతల్లో వచ్చిన మహమ్మారి తాజాగా నాల్గో పర్యాయం వస్తోంది. ఇటీవల విశాఖలోని ఒక కుటుంబానికి చెందిన ఇద్దరితో పాటు చికిత్స అందించిన వైద్యునికి, కడపలో వృద్ధురాలికి సోకింది. దేశవ్యాప్తంగా పలు కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
పెనుగొండలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది (ఫైల్)
న్యూస్రీల్
విస్తరిస్తున్న కోవిడ్
నమోదవుతున్న పాజిటివ్ కేసులు
కష్టకాలంలో నాడు కొండంత అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 46 కోవిడ్ సెంటర్లు
బాధితులకు ఉచితంగా వైద్యసేవలు, పౌష్టికాహారం
34.79 లక్షల మందికి వ్యాక్సినేషన్
నాడు కనుచూపు మేరలో కనిపించని విపక్ష నేతలు

మహమ్మారి.. మరోసారి!

మహమ్మారి.. మరోసారి!