
యోగాభ్యాసంతో మానసిక వికాసం
భీమవరం(ప్రకాశం చౌక్): యెగాభ్యాసంతో మానసిక వికాసం, ఆరోగ్యమైన జీవన విధానం సొంతమవుతుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. యోగాంధ్ర–2025 కార్యక్రమాల్లో భాగంగా సోమవారం భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో జరిగిన యోగా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ప్రజలతో కలిసి ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి, యోగా మాస్టర్ ట్రైనర్ బి.శిరీష యోగా విశిష్టతను వివరిస్తూ యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఈనెల 16న పేరుపాలెం బీచ్లో ప్రత్యేక యోగాంధ్ర, 19న భీమవరంలో సుమారు ఐదు వేల మంది క్రీడాకారులు, అథ్లెటిక్స్తో ప్రత్యేక యోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా లో పది లక్షల మందిని యోగాసనాల కార్యక్రమంలో భాగస్వాములు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ హరి శ్రీనివాస్, యోగ సాధకులు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై..
స్వర్ణాంధ్ర–2047 విజన్ అమలుకు విజన్ డాక్యుమెంట్ యూనిట్ల ఏర్పాటు మరింత ఊతంగా ఉంటుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ నుంచి జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.
కలెక్టర్ నాగరాణి